పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి జ్వరం జలుబు లాంటి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తాజాగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు... ఆయనను కలిసిన వారు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేసుకుని బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరికి పాజిటివ్ అని వచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.