దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా 4,09,083కి పెరిగింది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ఓవైపు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,850 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 613 మంది మృతువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది.
ఇందులో 2,44,814 యాక్టివ్ కేసులు కాగా, 4,09,083 మంది పూర్తిగా కోలుకున్నారు. పేషెంట్ల రికవరీ 60.80 శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, జూలై 3 వరకూ 95,40,132 శాంపుల్స్ పరీక్షించగా, శనివారం ఒక్కరోజే 2,42,383 శాంపుల్స్ పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.