వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా టీడీపీపై, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని అన్నారు. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయని పేర్కొన్నారు. 
 
ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉందని ట్వీట్ చేశారు. గతంలో టీడీపీ నుంచి కొంతమంది నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే వాళ్లు బీజేపీలో చేరారనే విమర్శలు ఉన్నాయి. మరికొంతమంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: