ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలల క్రితం సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వం విచారణకు గానూ హై పవర్ కమిటీ ని నియమించిన సంగతి తెలిసిందే. ఈ హైపవర్ కమిటి గత రెండు నెలలుగా గ్యాస్ లీక్  ప్రాంతంలో జరిగిన అనేక విషయాలపై అధ్యయనం చేసింది. గ్యాస్ లీక్ బాధితుల ఆరోగ్య పరిస్థితి నుంచి లీక్ అయిన గ్యాస్ తీవ్రత ఏంటీ... 

 

అదే విధంగా గ్యాస్ లీక్ ప్రాంతంలో మాడిపోయిన మొక్కల గురించి సహా అనేక విషయాలను అధ్యాయం చేసారు. ఈ నేపధ్యంలోనే వారు నేడు ముఖ్యమంత్రి  జగన్మోహన్‌రెడ్డిని కలవనుంది. ఈ హైపవర్ కమిటీ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నివేదిక సమర్పించనుంది అని తెలుస్తుంది. మధ్యాహ్నం సిఎం జగన్ తో భేటీ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: