ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆయన ఏది మాట్లాడినా సరే దాని వెనుక ఏదోక అర్ధం ఇప్పుడు కొన్ని మీడియాలు వెతుకుతున్నాయి. ఇక ఆయన కూడా కొన్ని చానల్స్ కి పదే పదే ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదని ఆయన ట్వీట్ చేసారు.
స్వార్థం కోసం జెండాలు మార్చేవారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థా ఉపేక్షించదు. పతనమైన విలువలకు ప్రాణం పోసే యత్నం చేస్తున్న జగన్ గారిని ఈ శక్తులేవీ అడ్డుకోలేవు. మీడియా ఎంటర్ టెయినర్లుగా మిగలడం మినహా సాధించేది ఏముండదు.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 6, 2020