అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి అని అన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ కాదని ఆయన అన్నారు. రాజధానిగా ఉన్న అమరావతిని మార్చడం ఏకపక్ష నిర్ణయం అని పవన్ మండిపడ్డారు. 

 

రాజధాని రైతులను రాష్ట్ర ప్రభుత్వం అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతులకు బిజెపి జనసేన అండగా ఉంటాయి అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా ఇటీవల రాజధాని ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆయన నుంచి ఏ ప్రకటన రాలేదు అనే ఆరోపణలు వచ్చాయి. 200 రోజులు అయిన సందర్భంగా అయన ఏమీ స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: