ఏపీ సిఎం జగన్ నివాసం లో అందరికి కరోనా పరిక్షలు చేసే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం భయపడుతుంది. ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా పరీక్షలు చేసినా సరే నిన్న వెయ్యి కేసులు వచ్చాయి. భారత్ లో  జరిగిన కరోనా పరీక్షల్లో పది శాతం ఏపీలోనే చేసారు. ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా ప‌రీక్ష‌లు ఏకంగా ప‌ది ల‌క్ష‌లు దాటేశాయి. ఇది దేశంలోనే రికార్డు.

 

ఇప్పుడు అలాంటి ఏపీలో సీఎం జగన్ ని కూడా కరోనా ఇబ్బంది పెడుతుంది. సిఎం  నివాసం వద్ద కొందరికి కరోనా వచ్చిన నేపధ్యంలో అందరికి కరోనా పరిక్షలు చెయ్యాలి అని అధికారులు నిర్ణయించారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరిక్షలు చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: