ఆంధ్రప్రదేశ్ లో 108 అంబులెన్స్ లను ఏపీ సర్కార్ ఘనంగా ప్రారంభించింది. దేశంలో ఎన్నడు లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ పూర్తి చేసింది. వెయ్యికి పైగా వాహనాలను ఏపీ సర్కార్ కొనుగోలు చేయడం వాటిని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది. అయితే వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న కొన్ని తప్పులు మాత్రం.. ఇబ్బంది పెడుతున్నాయి. 

 

తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒక ట్వీట్ చేసారు. అది ఏంటీ అంటే... టీడీపీ అభివృద్ధికి రంగులేయ‌డం, చంద్ర‌బాబు ప‌థ‌కాల‌కు పేర్లు మార్చ‌డం స్థాయి దాటిపోయిన  యుశ్రారైకాపా పేటిఎం బ్యాచ్ వేరే రాష్ట్రంలోని అంబులెన్స్‌లో 2017లో బిడ్డ ప్ర‌స‌వాన్ని ఏ రేంజ్‌లో వాడుతున్నారో చూడండి. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో జరిగిన సంఘటన ఏపీలో జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: