ఈ నెల 4 న టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రౌల రిమాండ్ విధించిన నేపధ్యంలో ఆయనను బందరు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. ఆయనను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన నాటి నుంచి బందరు జైల్లోనే ఉన్నారు. రిమాండ్ 14 రోజులు కావడంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

కొల్లు రవీంద్ర తరలింపునకు జిల్లా జడ్జి అనుమతి ఇచ్చిన నేపధ్యంలో ఆయనను భారీ బందోబస్తు మధ్య పోలీసులు తరలించారు. ఆయన వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో నాలుగో నిందితుడు అని బందరు పోలీసులు పేర్కొన్నారు. ఆయన సహకారంతోనే హత్య జరిగింది అని తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: