హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్‌లో ఇటీవలి కాలంలో వరుసగా పులుల మరణాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. తాజాగా మరో పులి మరణించింది. 11 ఏళ్ల వయసు ఉన్న మగ రాయల్ బెంగాల్ టైగర్ ‘కదంబ’ తాజాగా గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయిందని జూ అధికారులు వెల్లడించారు.

 

దీనిని 2014లో జూ కి తీసుకొచ్చారు. గత నెల రోజుల్లో నాలుగు పెద్ద పులుల మరణించడం ఆందోళన కలిగిస్తుంది. గత నెల రోజుల్లో రోజా, సోనీ, కిరణ్ అనే పులులు  ప్రాణాలు కోల్పోయాయి. గత నాలుగేళ్ళుగా పులులు వరుసగా మరనిస్తున్నాయి. 11 రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్స్ జూ లో ఉన్నాయి అని అధికారులు చెప్తున్నారు. అవి అరుదైనవి అని జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: