ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తమిళనాడులో అధికారంలో ఉన్న పళనిస్వామి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో కరోనా వైరస్ ని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు చేశారు. ‘సేవ్ చెన్నై’ పేరుతో కరోనా వైరస్ పై పోరుకు ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. వైరస్ ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. 
 
కేరళ కన్నా ఈ రాష్ట్రంలో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగ్గా ఉందని అయినా మిస్ మేనేజ్ మెంట్ వల్ల కేసులు పెరుగుతున్నాయని... అందువల్లే తాను ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని... ప్రజలను పోరులో భాగస్వామ్యం చేయలేకపోతుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు స్వచ్చందంగా కరోనాపై పోరులో భాగస్వాములు కావాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: