ప్రపంచ మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ విషయంలో ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే మన దేశంలో కరోనా కేసులు 7 లక్షలు దాటేశాయి. ఇక కరోనా మరణాలు కూడా 20 వేలు దాటాయి. ఇక కరోనా చివరకు జైలులో ఉన్న ఖైదీలను కూడా వదలడం లేదు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రక్షణ సౌకర్యాలు పటిష్టంగా ఉంటాయి. అయినా అక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెంట్రల్ జైలులో మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఓ హత్య కేసులో గత నెల 29న సెంట్రల్ జైలుకి ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన మహిళ ఖైదీగా వచ్చింది. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సదరు మహిళా ఖైదీని జైలు అధికారులు రాజానగరం జీఎస్ఎల్ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఆమెతో పాటు సన్నిహితంగా మెలిగిన వారందరూ తీవ్ర ఆందోళనతో ఉన్నారు.