విశాఖ ఎల్జీ పాలీమర్స్ ఘటనకు సంబంధించి సిఎం జగన్ కు ఏపీ సర్కార్ నియమించిన హైపవర్ కమిటీ  నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం కంపెనీ తప్పిదం అని స్పష్టం చేసారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా టీడీపీ నేతలు ఎవరు మాట్లాడలేదు. దీనిని తప్పుబట్టారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. 

 

విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ  నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు  మూతపడ్డాయని ఆయన ఎద్దేవా చేసారు. కంపెనీదే తప్పని  నిపుణులు తేల్చారన్నారు. తప్పు ఎవరు చేసిన  మూల్యం  చెల్లించుకోవాల్సిందే అన్నారు సీఎం. కమిటి ఇచ్చిన  సూచనలను  తప్పక  పాటిస్తారు. అందుకే పారదర్శకంగా  నివేదికను జనం ముందుంచారని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: