1.5 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి చైనా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందాని వ్యతిరేకిస్తూ .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నీలం జీలం నదుల పై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముజఫరాబాద్ లో ఆందోళన చేపట్టారు.
ఈ ప్రాజెక్టును ఆపేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాము అంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సేవ్ రివర్ సేవ్ జమ్మూ కాశ్మీర్ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏ ప్రాతిపదికన చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.