ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల కేంద్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టామని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.  టీడీపీ నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా అంటూ మండిపడ్డారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు ఒర్వలేకపోతున్నారు అని ఆయన ఆరోపించారు. ఇళ్ళ పట్టాలకు వ్యతిరేకంగా హైకోర్ట్ లో నాలుగు కేసులు వేసారని అన్నారు. 

 

హైదరాబాద్ లో మాత్రం చంద్రబాబు ఇంద్రభవనం కట్టుకున్నాడు అని ఆయన మండిపడ్డారు. టిడ్కో ద్వారా 3 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు అని మొత్తం 4300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: