ఈ మధ్య కాలంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కాస్త ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు కూడా ఆయనకు ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

 

ఈ నేపధ్యంలోనే ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. నీవు ఎంత వర్లినా, దొర్లినా మీ బాబు నిన్ను చట్ట సభకు పంపడు. రాజ్యసభ ఎన్నికల్లో మీ పరాభవాన్ని అర్థం చేసుకోగలం. ఫ్రస్టేషన్ పీక్స్ కు వెళ్లినట్లుంది. అవును పెద్దల సభలో ఉద్ధండులే కూర్చొంటారు.  ఆధారాల్లేకుండా చిల్లర మాటలు మాట్లాడేవారికి చోటులేదు. అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: