భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక  ఏపీలోని అన్ని జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 238 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అనంతపురం జిల్లాలో 153, విశాఖపట్నం జిల్లాలో 123, తూర్పుగోదావరి జిల్లాలో 112, శ్రీకాకుళం జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 100 కేసులు గుర్తించారు. 

 

తాజాగా శ్రీకాళహస్తిలో మరో కరోనా మరణం సంభవించింది. ఇటీవల కాలంలో ఇక్కడ కేసులు బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.   శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్న సదరు వ్యక్తి ఫలితాలు రాకముందే మరణించాడు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాక వచ్చిన ఫలితాల్లో మృతుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు, సమీప బంధువుల్లో ఆందోళన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: