తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పోలీసులు ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా అన్నా డీఎంకే సీనియర్ నేత విద్యుత్ శాఖ మంత్రి తంగమనికి కరోనా అని నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు . ఇక ఇటీవల ఉన్నత విద్య శాఖ మంత్రి కి కరోనా పాజిటివ్ రాగా.. మరి కొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా కరోనా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడుతుండటం సంచలనంగా మారుతోంది.