మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ సర్కార్ నిర్ణయం పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన కొత్త జిల్లాల విభజన చేయడం సరికాదంటూ జగన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ధర్మానా..

 

 శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే  రాజకీయంగా తాము ఎంతగానో దెబ్బ తింటాము  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన ప్రతిసారి జిల్లాలను విభజించలేము  కదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజన మంచిది కాదని.. ఈ నిర్ణయంతో శ్రీకాకుళం మరింత వెనుక పడిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: