తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,924 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 29,536కు చేరింది. ఒక్కరోజే 11 మంది వైరస్ భారీన పడి మృతి చెందగా మృతుల సంఖ్య 324గా ఉంది. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,590 కేసులు నమోదయ్యాయి. ఇవాళ రాష్ట్రంలో 992 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో 17,298 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 11,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: