ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు వాయిదా వేయడానికి గానూ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అనేది అధికార పార్టీ మాట. వారి కారణంగానే వాయిదా పడింది అంటూ అధికార పార్టీ నేతలు ఇప్పుడు పదే పదే టీడీపీ ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేసారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ,దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట టీడీపీ (తెలుగు దొంగల పార్టీ)నేతలు. పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే.ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా.

మరింత సమాచారం తెలుసుకోండి: