దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దాంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గిపోయాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. దాంతో మళ్లీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడం మొదలయ్యాయి.  తాజాగా జిల్లాలోని రాప్తాడు మండలంలో గల 44వ జాతీయ రహదారి గొల్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది.  హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.   సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

ప్రమాదంలో మృతి చెందిన వారు బుక్కరాయసముద్రం మండలం సిద్ధ రాంపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బెంగళూరు నుంచి అనంతపురం వస్తుండగా గొల్లపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: