గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిన్న మద్యప్రదేశ్లోని ఉజ్జయని ఆలయంలో మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్న వికాస్ దూబే ఆ తర్వాత బయటకు వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తి అతడిని గుర్తు పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నిస్తుండగా తాను దూబే అని అతడు బిగ్గరగా కేకలు వేయడంతో పోలీసులు అతడిని పట్టుకుని ఇంటరాగేషన్ చేసి కాన్ఫూర్కు తరలించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే దూబే కారు బోల్తా పడడంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని ఎన్కౌంటర్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్కు ముందు ఇంటరాగేషన్లో దూబే చెప్పిన వివరాలతో పోలీసుల మైండ్ బ్లాక్ అయిపోయిందట. తనను పోలీసులు పట్టుకునేందుకు వస్తోన్న విషయంతో పాటు తాను పారిపోయేందుకు కూడా పోలీసులే సాయం చేశారని చెప్పాడట. అలాగే ఎంతో మంది పోలీసులు తన నుంచి భారీగా లబ్ధి పొందిన విషయం కూడా దూబే చెప్పాడట.
అంత ఎందుకు దూబే చివరకు ఉజ్జయిని ఆలయంలో వీఐపీ పాస్తో దర్శనం చేసుకున్నాడంటేనే అతడి పాపులార్టీ ఎంత ఉందో తెలుస్తోంది. ఇక కాన్పూరులో జరిపిన కాల్పుల్లో ఏకంగా 8 మంది పోలీసులను కాల్చి చంపిన దూబే ఆ తర్వాత హరియాణాలోని ఫరీదాబాద్కు వెళ్లి అక్కడ నుంచి రాజస్థాన్లోని కోటా మీదుగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి వెళ్లాడు.