దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా,  ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్,  నీతి అయోగ్ సభ్యులు క్యాబినెట్ కార్యదర్శి.. పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ దృశ్య  తీసుకుంటున్న జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు నరేంద్రమోదీ. 

 

 దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ను కంట్రోల్ లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యంత్రంగం  తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా పలు సూచనలు సలహాలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు. కరోనా  వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాలని సూచించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: