బాలీవుడ్ లో అప్పట్లో సంచలనం సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘దంగల్’.  అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం క్రీడా నేపథ్యంలో తెరకెక్కించారు.  ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రూపొందించారు.  ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీలో సాక్షి తన్వార్,ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా లు నటించారు. అయితే  సినీరంగ ప్ర‌వేశానికి ముందే ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆస్ప‌త్రి నుంచి న‌ర్సింగ్ కోర్సులో డిగ్రీ కూడా పూర్తిచేసిన శిఖా మ‌ల్హోత్రా.. బాంబే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ప‌రిధిలోని ఆస్ప‌త్రిలో పేషెంట్ కౌన్సిల‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ది.

 

త‌న‌వంతుగా చిన్న సాయం చేస్తున్నాన‌ని శిఖా చెప్పింది.  కరోనా వచ్చిందంటే ఐన వారు ఆమడ దూరం ఉరుకుతున్న ఈ రోజుల్లో శిఖా చేస్తున్న పని ఎంతో అభినందనీయం.  గ‌త మూడు నెల‌లుగా తాను రోగుల‌కు ఉచితంగా సేవ‌లు అందిస్తున్నాన‌ని తెలిపింది.  హీరోయిన్ గా మంచి ఛాన్సు ఉన్నా.. ప్రజా సేవ చేయాలనే ఆమె సంకల్పం అభిమానులే కాదు.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: