చైనాలోని పుహాన్ లోని పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వినాశం చేస్తుంది.  కోటికిపైగా కేసులు నమోదు అయ్యాయి.. లక్షల్లో మరణాలు సంబవిస్తున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,28,39,626 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే దాదాపు 5,67,575మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. 

 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు  74,77,717 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.  రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.  దేశంలో పాజటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సగటున 20వేల కేసులతో పెరుగుతోంది. వరుసగా 8వ రోజు 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: