మధ్యప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధికారం కోల్పోగా ఇప్పుడు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం అధికార బీజేపీ గూటికి చేరుకున్నారు. బడా మల్హెర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రద్యుమ్న సింగ్ లోథి ఆదివారం భోపాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలుసుకున్నారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకునే ఆయన సీఎంను కలిసినట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే జ్యోతిరాదిత్య సింథియా పార్టీ మారినప్పుడే ఆయనతో పాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో కమల్నాథ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు గతవారం కేబినెట్ విస్తరణలో శివరాజ్ సింగ్ పెద్దపీట వేశారు.