ఈ యేడాది బాలీవుడ్ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పలువురు సీనియర్, టాలెంటెడ్ నటులను బాలీవుడ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్(36) శనివారం మృతిచెందారు. రాజన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చండీగఢ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అతని మృతిపై సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (సీఐఎన్టీఏఏ) సోషల్ మీడియా వేదికగా నివాళి ఆర్పించింది. కాగా, 2010 నుంచి రాజన్ సీఐఎన్టీఏఏ సభ్యునిగా ఉన్నారు.రాజన్ ఐశ్వర్యరాయ్ - రణదీప్ హూడా జంటగా నటించిన సరబ్జిత్, ఫోర్స్, కర్మ, మహీ ఎన్ఆర్ఐ (పంజాబీ) చిత్రాల్లో కూడా రాజన్ తనదైన నటనతో మెప్పించారు.