ఈ మద్య చాలా మంది క్షణిక ఆవేశాలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో, ప్రేమ విఫలమై, భార్యా భర్తల మద్య విభేదాలతో, తమ కెరీర్ లో ఏమీ సాధించలేకపోతున్నామన్న బాధతో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ న్యూస్ చానెల్ లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిద్దిపేటకు చెందిన పీ రాములు కుమార్తె కల్యాణి (26), ఓ న్యూస్ ఛానల్ లో విధులు నిర్వహిస్తూ, గత రెండేళ్లుగా అదే చానెల్ లో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉంది.

 

తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. తనను వివాహం చేసుకోవాలని కల్యాణి, శివను కోరగా, అతను నిరాకరించాడు. దీంతో తాను బతకడం వృథా అని భావించిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది.  ప్రస్తుతం తన సోదరుడితో కలిసి ఉంటుంది.. అతను విధులు ముగించుకొని ఇంటికి రావడంతో కల్యాణి మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరిలించి, పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. తన కుమార్తె మృతికి శివ కారణమన్న ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: