బిహార్​ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీ.. తన రెండో జాబితాను విడుదల చేసింది. 49 మంది పేర్లను ప్రకటించిన ఈ జాబితాలో.. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా తనయుడు లువ్​ సిన్హా, జేడీయూ నేత శరద్​యాదవ్​ కుమార్తె సుభాషిని యాదవ్​లకు చోటు దక్కింది. బంకిపుర్​ నియోజకవర్గం నుంచి సిన్హా పోటీ చేయనుండగా.. బిహారీగంజ్​ నుంచి సుభాషిని బరిలోకి దిగనున్నారు.ఇటీవలే లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ)ని వీడిన సుభాషిని.. బుధవారమే కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఈమెతో పాటు అదేరోజు పార్టీలో చేరిన మాజీ ఎంపీ కాళీ పాండే.. కుచాయ్​కోట్​ అసెంబ్లీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


తాజాగా విడుదలైన అభ్యర్థుల జాబితా నవంబర్​ 3, 7 తేదీలలో జరగబోయే రెండు, మూడు దశల ఎన్నికలకు సంబంధించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్​ 28న జరగనున్న తొలిదశ పోలింగ్​కు 21 మంది అభ్యర్థులతో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​.ఆర్జేడీ నాయకత్వంలోని 'మహాగట్​బంధన్​' లో భాగంగా మొత్తం 70స్థానాల్లో పోటీ పడుతోంది కాంగ్రెస్​.

మరింత సమాచారం తెలుసుకోండి: