సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్​-చైనా దేశాలు చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్చల్లో ఏం జరుగుతోందనేది మాత్రం రహస్యంతో కూడిన వ్యవహారమని పేర్కొన్నారు.భారత్​-చైనా మధ్య జరుగుతున్న చర్చలపై స్పష్టమైన జవాబు ఇవ్వాలని ఓ మీడియా సమవేశంలో అడగగా.. 'చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంద'ని వెల్లడించారు జైశంకర్​.


అదే సమయంలో.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల మోహరింపు జరిగిందని అంగీకరించారు విదేశాంగమంత్రి.టిబెట్​లో పరిస్థితులపై ప్రశ్నించగా.. లద్దాఖ్​తో సంబంధం లేని విషయాలపై మాట్లాడకూడదని అభిప్రాయపడ్డారు విదేశాంగమంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: