పంజాబ్ తో మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్ ని ఆరో స్థానంలో పంపడంపై చాలా మంది ఆశ్చర్యపోయారు. వాషింగ్టన్ సుందర్, శివం దూబే తర్వాత ఏబీని కోహ్లీ పంపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతను ఆశించిన స్థాయిలో స్కోర్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే అనే ఆరోపణలు చాలానే వచ్చాయి. అయితే దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ చెప్పాడు. కేవలం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నాడు.

తమకు పై నుంచి సూచన వచ్చిందని చెప్పాడు. కొన్ని నిర్ణయాలు కెప్టెన్ లే కాదు పై నుంచి కూడా తీసుకుంటారు అన్నట్టు చెప్పాడు. కాగా ఈ మ్యాచ్ లో ఏబీ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు.  కాగా అదే మైదానంలో గత మ్యాచ్ లో ఏబీ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 73 పరుగులు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: