వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడికి ప్రయత్నం చేసాడు ఒక వ్యక్తి. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి ఈ దాడిలో పాల్గొన్నాడు. ఎంపీ నందిగం సురేష్  పై అతని నివాసం వద్ద దాడికి ప్రయత్నించాడు తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్ర రావు. ఎంపీ తన నివాసం నుండి బయటకు వెళ్ళే సమయంలో బైక్ ను అడ్డుపెట్టి రాడ్ తో దాడి చేయడానికి ప్రయత్నం చేసాడు.

గన్ మెన్ లు అడ్డుకోవడం తో పారిపోయాడు పూర్ణచంద్ర రావు. వెంటాడి పట్టుకుని తుళ్ళూరు పోలీసులకు అప్పగించారు ఎంపీ గన్ మెన్ లు.  ఈ ఘటన సంచలనంగా మారింది. ఎంపీపై ఎందుకు దాడి చేసారు ఏంటీ అనేది తెలియలేదు. రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తి దాడి చేయడమే ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: