విజయవాడ ప్రేమ హత్యలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దివ్యను తాను హత్య చేయలేదు అని, ఎవరి గొంతు వాళ్ళు కోసుకున్నామని నిందితుడు  నాగేంద్ర మీడియాకు చెప్పాడు. దివ్యకు తనకు వివాదం అయిందని అన్నాడు. పెళ్లి చేసుకున్ధాని దివ్య  తనని కోరింది అని చెప్పాడు. దివ్య తో మాట్లాడటానికి తాను ఇంటికి వెళ్ళా అని చెప్పాడు.

దివ్య గొంతు తాను కోయలేదు అని చెప్పాడు. ఇద్దరం కలిసి తాను ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నట్టుగా చెప్పాడు. పెళ్లి తర్వాత తల్లి తండ్రులు తమను విడదీసారు అని అతను ఆవేదన వ్యక్తం చేసాడు. దివ్య పెళ్లి చేసుకోవాలని అడగగా తాను మరోసారి ఆలోచించుకో అని చెప్పా అని అతను పేర్కొన్నాడు. గొంతు కోసుకున్న తర్వాత స్పృహ తప్పి పడిపోయా అని, ఆ తర్వాత తన చేయి ఎవరు కోసారో తెలియదు అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: