భారత్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడుతున్న నేపధ్యంలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. మన దేశంలో గత 24 గంటల్లో 63,371 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 895 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. మొత్తం కేసుల సంఖ్య 73,70,469 గా ఉందని పేర్కొన్నారు.

వీటిలో 8,04,528 క్రియాశీల కేసులు, 64,53,780 రికవరీలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు 1,12,161 మరణాలు నమోదు అయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్న 10,28,622 నమూనాలను పరీక్షించారని వివరించింది. అక్టోబర్ 15 వరకు దేశంలో మొత్తం 9,22,54,927 నమూనాలను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఒక ప్రకటనలో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: