బీహార్‌లో జరగబోయే ఎన్నికలకు ముందే ఎల్‌జెపి అధినేత చిరాగ్ పాస్వాన్ సిఎం నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సిఎం ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేసిన ఆయన జేడియుకి ఓట్లు వేయవద్దు అని ప్రజలను కోరడం గమనార్హం. ఇక ఈ వ్యాఖ్యలపై బిజెపి పెద్దలు కూడా అసహనం వ్యక్తం చేసారు.  ఎన్నికల తర్వాత తాము బిజెపికి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేసారు.

ఇదిలా ఉంటే బీహార్ లో ఎల్జెపి ఎన్డిఎలో భాగం కాదని బీహార్ ఉప  ముఖ్యమంత్రి సుషీల్ మోడీ అన్నారు. “నేను ప్రజలకు చెబుతున్నాను, ఎల్జెపి అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా మీ ఓట్లను వృథా చేయవద్దు.” అని సుషీల్ మోడీ కోరారు.  వ్యూహం ప్రకారమే ఎన్డియేలో చిచ్చు పెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. బీహార్ లో ఎన్డియే అధికారంలోకి వస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: