చంద్రబాబు గారు నిర్మించిన సైబరాబాద్, అమరావతి రెండూ ఎంత పెద్ద వరద వచ్చినా మునగలేదు అనే విషయం బురద మంత్రి అనిల్ గుర్తుపెట్టుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. నిర్మించే విజనరీ చంద్రబాబు. పడగొట్టే విజనరీ  జగన్ రెడ్డి. అంటూ ఆమె ఎద్దేవా చేసారు. ఈ రెండింటి మధ్యా తేడా అనిల్ తెలుసుకోవాలని సూచించారు. జగన్ రెడ్డి గారి దరిద్ర పాదం వలన రాష్ట్రం 17 నెలలుగా వణికిపోతుందని అన్నారు.

గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరదలు,గ్యాస్ లికేజీలు,అగ్ని ప్రమాదాలు,జల సమాధులు,మహిళల పై అఘాయిత్యాలు,దళితుల పై దాడులు,భవన నిర్మాణ కార్మికులు, రైతుల ఆత్మహత్యలని  ఆమె మండిపడ్డారు. ఇలా చెప్పుకుంటే 17 నెలల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రజలు పడుతున్న నరకం అంతా ఇంతా కాదని అన్నారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్లే రాష్ట్రం తిరోగమనం పడుతుందని ఆమె ఆరోపించారు. అనీల్ వలనే ప్రజలు మునిగిపోయారు  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: