ఈ మధ్య కాలంలో పలువురు ప్రముఖులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా భూ వివాదాల్లో  ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. తాజాగా  కత్తి కార్తీక పేరు కూడా వినపడింది. కత్తి కార్తీక  పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తా అంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడ్డారు కార్తీక , ఆమె అనుచరులు.

అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమినీ ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇప్పించేందుకు మద్య వర్తిత్వం చేసింది కార్తీక. బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు కార్తీక రెడ్డి ఆమె అనుచరులు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితుడు.  కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: