ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కేబినేట్ సమావేశం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కేబినేట్ భేటీ ని మరో వారం రోజుల్లో ఏపీ సర్కార్  నిర్వహించే అవకాశం ఉంది. ఇళ్ళ పట్టాల పంపిణీని ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఏపీలో కరోనా తీవ్రత మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇటీవల ఏపీలో వరదల తీవ్రత చాలా అధికంగా ఉంది.

దాని మీద కూడా చర్చిస్తుంది కేబినేట్. రైతులకు చేసే వరద సాయం మీద చర్చిస్తుంది కేబినేట్. అంతే కాకుండా ఏపీలో ప్రవేశ పెట్టబోయే సంక్షేమ కార్యక్రమాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి జలాల గురించి కూడా కేబినేట్ చర్చించే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: