భారత్ లో కరోనా కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. మొన్నటి వరకు తగ్గినా సరే కరోనా కేసులు మాత్రం మళ్ళీ ఇప్పుడు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. గత 24 గంటల్లో మన దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో... 62 వేల 212 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 837 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మొత్తం కేసుల సంఖ్య 74  లక్షల 32 వేల 681 గా ఉంది. వీటిలో 7 లక్షల 95 వేల 087 క్రియాశీల కేసులు నమోదు అయ్యాయి.  65 లక్షల 24 వేల 596 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,12,998 మరణాలు నమోదు అయ్యాయి అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: