దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో గెలిచింది. 178 పరుగుల లక్ష్య ఛేదనను మరో రెండు బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది ఆర్సీబీ. డివిలియర్స్(55 నాటౌట్), కోహ్లీ(43) విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ.. ప్లేఆఫ్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది.


ఛేదనలో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. 14 పరుగులు చేసిన ఫించ్ ఔటయ్యాడు. అనంతరం దేవ్​దత్-కోహ్లీ జోడీ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది. ఈ క్రమంలోనే రెండో వికెట్​కు 79 పరుగులు జత చేసింది. అనంతరం దేవదత్(35), కోహ్లీ(43) వరుస బంతుల్లో ఔటయ్యారు. తర్వాత వచ్చిన డివిలియర్స్(22 బంతుల్లో 55) లాంఛనాన్ని పూర్తి చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో త్యాగి, శ్రేయస్ గోపాల్, తెవాతియా తలో వికెట్ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: