షార్జా వేదికగా ఉత్కంఠంగా సాగిన పోరులో ఢిల్లీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్​ కింగ్స్​పై ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఒక్క బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
 శిఖర్ ధావన్(101) సెంచరీతో మెరిసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సారథి శ్రేయస్ అయ్యర్(23), మార్కస్ స్టొయినిస్(24) పర్వాలేదనిపిచ్చారు. 

ఈ విజయంతో శ్రేయస్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. చెన్నై బౌలర్లలో చాహర్(2) సామ్ కరణ్, శార్దూల్ ఠాకూర్, బ్రావో తలో వికెట్ తీశారు.తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఖాతా తెరవకముందే సామ్‌కరన్‌ను దేశ్‌పాండే పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వాట్సన్‌ (36; 28 బంతుల్లో, 6×4)తో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత దూకుడు పెంచడం వల్ల స్కోరుబోర్డు పరుగులు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: