కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పట్నా విమానాశ్రయంలో తిరుగు పయనమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ రెక్కలు సమీపంలో విమానాశ్రయ వైరింగ్‌లను తాకడం వల్ల విరిగిపోయాయి. దీంతో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది.


ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఆయనతో పాటు బిహార్‌ ఆరోగ్య మంత్రి మంగల్‌పాండే, జలవనరుల మంత్రి సంజయ్‌జా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో హెలికాప్టర్‌ ప్రమాదం అని వింటే అందరి మదిలో మెదిలే నేత ఒకే ఒక్కరూ.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ఓ హెలికాప్టర్‌ ప్రమాదంలో రాష్ట్ర ప్రజలని వదిలి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: