బంగాల్​ బిజేపి అధ్యక్షుడికి  నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రెండురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనకు  కొవిడ్​ పరీక్ష నిర్వహించారు.ఘోష్​కు ప్రస్తుతం 102డిగ్రీల జ్వరం ఉంది. ఆయన ఆక్సిజన్ స్థాయిలు నిలకడగానే ఉన్నాయి. భయపడాల్సిన అవసరంలేదు" అని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు.


తమిళనాడులో మరో 4,295 మందికి పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజు వ్యవధిలో 57మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 83వేల 486కు చేరింది. మరణాల సంఖ్య 10,586కు పెరిగింది. 6లక్షల 32వేల 708 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.రాజస్థాన్​లో కొత్తగా నమోదైన 1,992 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1లక్ష 71వేల 281కి చేరింది. ఇప్పటివరకు 1,735 మంది చనిపోయారు. ప్రస్తుతం 21,255 యాక్టివ్ కేసులున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: