జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద కదలికల నిర్మూలన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా దక్షిణ కశ్మీర్​ పాంపోర్​ ప్రాంతంలో లష్కరే తోయిబా(ఎల్​ఈటీ)కి అనుబంధంగా పనిచేస్తోన్న ఓ ఉగ్రవాదిని అరెస్ట్​ చేసినట్లు జమ్ముకశ్మీర్​ పోలీసులు తెలిపారు.అరెస్ట్​ అయిన వ్యక్తి పాంపోర్​లోని జాఫ్రోన్​ కాలనీకి చెందిన హరిస్ షరీఫ్​ రాథర్​గా గుర్తించారు. అతని నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ చర్యల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


ఈ ఏడాది శ్రీనగర్​-జమ్ము రహదారిలో భద్రతా దళాలపై జరిగిన నాలుగు దాడుల్లో పాలుపంచుకున్న పాకిస్థానీ ఉగ్రవాది సైఫుల్లా సన్నిహితుల్లో ఆరుగురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు పేర్కొన్న మరుసటి రోజునే ఈ అరెస్ట్​ చేపట్టడం మరో ముందడుగు. అరెస్టైన వారి నుంచి దాడులకు ఉపయోగించిన కార్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: