రెండో విడత బిహార్​ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఎల్​జేపీ(లోక్​ జన్​ శక్తి పార్టీ)..  విడుదల చేసింది. 53 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో భూమిహార్​లు, మైథిలీలు, బ్రాహ్మణులకు చోటు కల్పించింది. 16 మంది మహిళలకు ఈసారి టికెట్లను అందించారు ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​.


అంతకుముందు, తొలివిడత ఎన్నికల కోసం.. అక్టోబర్​ 8న, 42 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది ఎల్​జేపీ. టికెట్​ దక్కించుకున్న అభ్యర్థులను చిరాగ్​ పాసవాన్​ అభినందించారు. నితీశ్​కుమార్​ నేతృత్వం వహిస్తున్న జేడీయూను ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: