బిహార్‌లో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నబీనగర, ఔరంగాబాద్‌ తదితర జిల్లాల్లో ప్రచార సభల్లో శనివారం పాల్గొన్న ఆయన... బిహార్‌లో ఎన్డీయే పాలనకు ముందు, తర్వాత పరిస్థితులను ప్రజలకు వివరించారు. ఆర్జేడీ ప్రస్తుత సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శల జల్లు కురిపించారు.



ఎన్డీయే పాలనలో మహిళల విద్యకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు నితీశ్. బాలికలకు సైకిల్‌ యోజన, పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పోలీసు ఉద్యోగాల్లో 35శాతం మహిళలకే కేటాయించామని, ఈ స్థాయిలో ఏ రాష్ట్రం మహిళలకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: