భారత సైన్యం సరిహద్దులో చేపట్టిన పటిష్ఠమైన చర్యల కారణంగా జమ్ముకశ్మీర్లోకి నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు గణనీయంగా తగ్గినట్లు భారత సైన్యం కమాండర్​ బీఎస్ రాజు తెలిపారు. బలగాలు తీవ్రంగా శ్రమించినందు వల్లే ఇది సాధ్యమైందన్నారు. అదనపు నిఘా, చిన్న, పెద్ద సైజు డ్రోన్ల వినియోగం, సాంకేతికత, క్షేత్రస్థాయిలో బలగాల మోహరింపుతో పాకిస్థాన్ ముష్కరుల చొరబాట్లను నిలువరించినట్లు చెప్పారు.


పాకిస్థాన్, భారత్​ల సరిహద్దు ప్రాంతం కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి గతేడాది 130 సార్లు చొరబాటు ఘటనలు జరిగితే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 27 ఘటనలే జరిగినట్లు బీఎస్ రాజు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అయితే పాకిస్థాన్​ కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘనలు మాత్రం కొంతమేర పెరిగినట్లు జనరల్​ బీఎస్​ రాజు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: