రాత్రి కురిసిన వర్షానికి పాత బస్తీ లో చాలా ప్రదేశాల్లో వరద నీరు చేరిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశామని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. పాత బస్తీ లోని ఫలక్ నుమా బిడ్జ్ పైన ఆరు అడుగుల గొయ్యి పడిందని అన్నారు. దీంతో మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేసామని పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయం తో వరద ప్రాంతాల్లో ఉన్నవారిని రెస్క్యూ చేస్తున్నామని వివరించారు. అనవసరంగా ఎవరు కూడా రోడ్లు పైకి వాహనాలు తీసుకుని రావొద్దు అని ఆయన కోరారు. ఇంకా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుందని అన్నారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కోరుతున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: