సూర్యాపేట జిల్లాలో ఒక దారుణం జరిగింది. ఆస్తి కోసం వ్రుద్దురాలిని  మహిళను దారుణంగా చంపేశారు. రెండేళ్ళ నుంచి ఈ కేసులో ఏ విధంగా కూడా సాక్ష్యాలు దొరకలేదు. కోదాడ రూరల్ సర్కిల్ పోలీసులు ఈ హత్యను చేధించారు. వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎస్పీ భాస్కరన్ ఆదేశాలతో పెండింగ్ కేసులపై దృష్టి సారించిన పోలీసులు... ఈ కేసుని చేధించారు.

11 నవంబర్ 2018లో వేపల సింగారంలో కాలిన మహిళ మృతదేహం లభ్యం అయింది.  మిస్సింగ్ కేసులో విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాలు నేపథ్యంలోనే మఠంపల్లికి చెందిన పాపులు అనే మహిళను ఆమె అక్క కూతురు కాల్చి చంపేసింది. ఆమె మరిది రామ్ భూపాల్ రెడ్డి తో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. హత్యలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పరారీలో మరొకరు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: